హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతి మెడికల్ కళాశాలలో 25 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)ను, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఎస్)నూ అమలు చేయాలని సూచించింది. ఈ మూడు వ్యవస్థలను ఢిల్లీలోని ఎన్ఎంసీలో ఉన్న కమాండ్ కంట్రో ల్ సెంటర్కు అనుసంధానించాలని పేర్కొన్నది.
సీసీ కెమెరాల ఏర్పాటు, అనుసంధాన ప్రక్రియ మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లో కలిపి 668 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పటివరకు 5,200 సీసీ కెమెరాలు మాత్రమే కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం అయ్యాయి.