హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): దేశ ప్రజల్లో అత్యధిక మందిలో రక్తహీనత నియంత్రణకు ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అధ్యయనం చేసినట్టు ఎన్ఐఎన్ పేర్కొన్నది. దీనికోసం కేంద్రం విధివిధానాలను రూపొందిస్తుంది. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐరన్ సప్లిమెంట్లు పంపిణీ చేస్తుండగా, ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం కూడా పెంచాలని ఎన్ఐఎన్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఫోర్టిఫైడ్ రైస్పై దేశవ్యాప్తంగా పలు అనుమానాలు ఉన్నాయి. పరిమితికి మించి వినియోగించే ఈ తరహా ఆహారం ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని భావిస్తున్నారు. ఐరన్ సమృద్ధిగా ఉండే ఫోర్టిఫైడ్ రైస్ వినియోగాన్ని పెంచి రక్తహీనతను తగ్గించడానికి దీని ఆవశ్యకత ఉందని ఎన్ఐఎన్ పరిశోధకులు వెల్లడించారు.