TS Weather Update | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో అత్యధికంగా 13.6 సెం.మీ వర్షపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ వివరించింది.