హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా బస్సులు నడుస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆర్టీసీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రయాణికులను అవస్థలకు గురిచేస్తున్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నది.
పండుగలు, సెలవు రోజుల్లో సర్వీసులను తగ్గిస్తుందన్న వార్తల్లో నిజం లేదని టీఎస్ఆర్టీసీ తెలిపింది. రద్దీకి అనుగుణంగా పండుగ రోజుల్లో అదనపు బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించింది.