హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల దృష్ట్యా నిబంధనల ప్రకారం అధికారుల బదిలీలపై ప్రతిపాదనలను ఈ నెల 28లోగా పంపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలను ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ ఎంపీడీవోలు సహా రాష్ట్రంలో బదిలీలు చేయాల్సిన అధికారుల జాబితాతో ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. మూడేండ్లుగా ఒకేచోట, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారితోపాటు బదిలీలు చేయాల్సిన అధికారుల జాబితాను పంపాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.