హైదరాబాద్, డిసెంబర్ 30, (నమస్తే తెలంగాణ): బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్పై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన రోడ్డు ప్రమాద కేసులో సీఆర్పీసీ చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. గతవారం ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొన్న కేసులో సాహిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాహిల్ దుబాయి పారిపోయి ఉంటాడనే అనుమానంతో పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీచేశారు.
ఈ కేసులో సాహిల్ స్నేహితులైన తమను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని సయ్యద్ జక్రియా రెహమాన్, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగానే విచారణ ఉండాలని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.