హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. 10 జిల్లాల్లోని 15,246 మంది రైతులకు రూ.15.8 కోట్లు కేటాయిస్తూ విపత్తు నిర్వహణ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి 21 తేదీల మధ్య ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.
15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వానికి నివేదిక అందగా..ఎకరాకు రూ.10వేల చొప్పున పరి హారం అందించనున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో నిధుల ను కేటాయిస్తూ తాజాగా విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. నిధులు విడుదలైన నుంచి 90 రోజుల్లోగా రైతుల ఖాతాలో జమ చేయనున్నా రు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వ్యవ సాయశాఖ కమిషనర్కు సూచించారు.