హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి ప్రజాసంబంధాల ముఖ్య అధికారిగా సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దూడపల్లి విజయ్కుమార్ నియమితులయ్యారు. వీరి నియామక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం విడుదల చేశారు.
నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లికి చెందిన అయోధ్యరెడ్డి సుదీర్ఘకాలం పాత్రికేయునిగా కొనసాగారు. ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లో వివిధ హో దాల్లో పనిచేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన విజయ్కుమార్ ప్రస్తుతం ఈనాడు పత్రిక ఢిల్లీ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.