హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి ‘తెలంగాణ వచ్చుడో..కేసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పింది. నాటి దీక్ష చరిత్ర గతినే మార్చి వేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు. మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన ఆనాటి కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, ఆనాటి కేసీఆర్ త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు.
రేపటితో దీక్షా దివస్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను కూడా మరువలేమని మంత్రి అన్నారు.
తెలంగాణ సాధించిన కెసీఆర్ సీఎంగా తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తి తో బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ త్యాగ నిరతికి కృతజ్ఞతలు తెలిపారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం మన అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కూకట్పల్లిలో రేవ్ పార్టీ భగ్నం..44 మంది యువకులు అరెస్ట్
Crime news | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైన ఇసుక లారీ
పూలే ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి