హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్తో పొత్తు అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదని ఉభయ పార్టీల నేతలు వెల్లడించారు.
అక్టోబర్ 1న సీపీఐ, సీపీఎం కలిసి పోటీచేసే స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్తో పొత్తు.. ఆ పార్టీ తమకు సీట్లు ఇస్తుందనేది ఉహాజనితమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాగా, ఉభయులూ కలిసి దాదాపు 28 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.