రంగారెడ్డి : జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో రైతు వేదిక భవనం ప్రారంభంతో పాటు చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రేగడి దొస్వాడ గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం దిశగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
కరోనా వల్ల ఆదాయం తగ్గినా తెలంగాణ లో 308 కోట్లు ప్రతి నెల గ్రామాలకు పల్లె ప్రగతి నిధులు విడుదల చేస్తాన్నామని మంత్రి తెలిపారు. 60 లక్షల మంది రైతులకు రైతు బంధు సహాయం అందజేశామన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం రాష్ట్రంలో 2,604 రైతు వేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఇంటింటి జ్వర సర్వే తో తెలంగాణ లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై డిస్కవరీ ఛానల్లో ఈ రోజు రాత్రి ప్రసారం అయ్యే డాక్యుమెంటరీని అందరూ చూడాలన్నారు. పాలనలో నూతన ఒరవడి సృష్టిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోతారన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో రూ.11 కోట్ల 50 లక్షలతో చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
కరోనా టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయా.. ?