హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతమని చేనేత శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్, మెరిట్ సర్టిఫికెట్స్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ను మంత్రి అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహీతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత పథకాలతో చేనేత రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.
చేనేత కళాకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్. రమణ, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?