Revanth Reddy | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు, వారిని ఎంపిక చేయటంలో రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరే అందుకు నిదర్శమని సూత్రీకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి బీజేపీకి బలాన్ని ఇవ్వటంలో భాగంగానే ఆయన వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని సదరు వర్గం నేతలు అంతర్గత చర్చల్లో గుండెలు బాదుకుంటున్నారని ప్రచారం సాగుతున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం కలిగించేందుకు ఆ పార్టీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందంలో భాగంగానే పోటీ ఇవ్వలేని అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్టు ఆ వర్గం ఆరోపిస్తున్నది. ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికీ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు, టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకొంటున్న అభ్యర్థుల స్థానాల్లో ఇతర పార్టీల నుంచి దిగుమతి అయిన నేతలను బరిలో దింపటం ఆశావహులకు మింగుడు పడటం లేదు.
ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లు సైతం రేవంత్, ఆయన వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో 2వ మొదటి నుంచి పనిచేస్తున్నవారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయించటం ఏమిటి? అని, ఇదే కొనసాగితే ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అదే సమయంలో బీజేపీతో సీఎం రేవంత్ టచ్లో ఉన్నారని తెలంగాణ ఉద్యమకారు డు, బుద్ధిజీవుడైన గాదె ఇన్నయ్య లాంటి వాళ్లు చేసి న ఆరోపణలు మరింత అగ్గిరాజేసినట్టు అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు, అవే స్థానాల్లో బీజేపీ బరిలో నిలిపిన అభ్యర్థులను పోలికపెడుతూ రేవంత్పై జోరుగా ప్రచారం సాగుతున్నది. ఒక్కో నియోజకవర్గాన్ని పరిశీలిస్తే..
చేవెళ్ల లోక్స భ అభ్యర్థిగా గ డ్డం రంజిత్రెడ్డి ని కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మా జీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఖరారయ్యారు. కాం గ్రెస్లో చేరకముందు రంజిత్రెడ్డిని ‘గుండోడా.. గుడ్డోడా’ అని బహిరంగసభ వేదికల నుంచే నిప్పు లు చెరిగిన రేవంత్రెడ్డి.. అదే అభ్యర్థిని ప్రకటించటం వెనుక బలమైన కారణం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ ఇక్కడ గెలవాలంటే ‘ఈ సారి అభ్యర్థిని మారిస్తే మంచి ఫలితం ఉంటుంది’ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసే రంజిత్రెడ్డిని రేవంత్ తమ పార్టీలోకి ఆహ్వానించారని, తన పూర్వమిత్రుడు కొండా విశ్వేశ్వర్రెడ్డికి మేలు చేసేందుకేనని ప్రచారం సాగుతున్నది.
సీఎం, డిప్యూటీ సీఎం మధ్య నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నలిగిపోయిందని, అందుకు అభ్యర్థే కారణమనే చర్చ సాగుతున్నది. ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజికవర్గ ఓట్లే ఎక్కువ. మాల సా మాజిక వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్ కేటాయించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్కు మేలు చేసేందుకే హైకమాండ్కు రేవంత్ ఈ ఒక్క పేరునే సిఫార్సు చేశారనే ఆరోపణలున్నాయి.
సికింద్రాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కిషన్రెడ్డికి పోటీగా బీఆర్ఎస్ నుంచి నాలుగు రోజుల క్రిత మే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు టికెట్ ఇచ్చారు. పీజేఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన దానంకు ఇప్పుడు ఆ నియోజకవర్గమే సహకరించే పరిస్థితి లేదనే ప్రచారం సాగుతున్నది. అటువంటిది ఆయనకు లోక్సభ టికెట్ ఇప్పించటం తన పూర్వమిత్రుడు కిషన్రెడ్డిని గెలిపించేందుకే అని కాంగ్రెస్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెదక్ లోక్సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావును బీజేపీ బరిలో నిలిపింది. అక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును బరిలో నిలుపుతారని ప్రచారం సాగింది. కానీ, ఉన్నఫలంగా నీలం మధుకు టికెట్ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. బలమైన క్యాండిడేట్ను పెడితే ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని, అందుకే బలహీనమైన అభ్యర్థిని నామమాత్రంగా నిలబెట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపిచేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మల్కాజిగిరి స్థానం నుంచే గత ఎన్నికల్లో రేవం త్ ఎంపీగా గెలిచారు. ఈ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం. కానీ, నియోజకవర్గానికే పరిచయం లేని వ్యక్తిని బరిలో నిలపటం వెనుక భారీ మంత్రాంగమే ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు ప్రయోజనం కలిగించేందుకే తమ పార్టీ సీనియర్లు, సమర్థులను కాదని సునీతామహేందర్రెడ్డికి టికెట్ ఇచ్చారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
బీజేపీ: కొండా విశ్వేశ్వర్రెడ్డి
కాంగ్రెస్: గడ్డం రంజిత్రెడ్డి
బీజేపీ: పోతుగంటి భరత్ ప్రసాద్
కాంగ్రెస్: మల్లు రవి
బీజేపీ: ఈటల రాజేందర్
కాంగ్రెస్: సునీతా మహేందర్రెడ్డి
బీజేపీ: జీ కిషన్రెడ్డి
కాంగ్రెస్: దానం నాగేందర్
2019 ఎన్నికల నుంచి ఆ తర్వాత రాష్ట్రం లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్కు మధ్య సహకార ఒప్పందం కొనసాగుతున్నద ని, అందుకు లోగడ జరిగిన ఎన్నికల ఫలితాలే సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా సహకరించటం వల్లే ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారనే విమర్శలు ఉన్నాయి. హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపిందని ఆరోపణలు ఉన్నాయి.