హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వామపక్షాలకు చెరో రెండు సీట్లు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం.
సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు, సీపీఐకి కొత్తగూడెం, మనుగోడు నియోజకవర్గాలను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, వామపక్షాలకు చెరో రెండ్లు సీట్లు ఇచ్చే ప్రతిపాదనేదీ కాంగ్రెస్ నుంచి రాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. సీట్ల అంశం రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.