Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections)కు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో అంటే.. నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ( private establishments), ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సంస్థలు సెలవు ఇవ్వాని ఆదేశించారు.
సెలవు ఇవ్వని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఎన్నికల వేళ (2018 అసెంబ్లీ, 2019 లోక్సభ) కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు సీఈవో తెలిపారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు (Educational institutions) సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read..
Telangana Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు.. రెండు రోజులు బడులకు సెలవు
CM KCR | నన్ను ముఖ్యమంత్రిని చేసి నా గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ గజ్వేల్: సీఎం కేసీఆర్
Minister Mallareddy | అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి : మంత్రి మల్లారెడ్డి