హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల అధ్యయానికి కేంద్ర పంచాయతీరాజ్శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ర్టాల అధికారులను నియమించింది. ఈ బృందాలు వివి ధ అంశాలపై అధ్యయనం చేసి నివేదికలను ఈ నెల 30లోగా కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక బృందానికి కేంద్ర పంచాయతీరాజ్శాఖ ఆర్థిక సలహాదారు, మిగిలిన మూడు బృందాలకు జాయింట్ సెక్రటరీలు నేతృత్వం వహించనున్నారు. ఇందులో ఒక బృందంలో తెలంగాణ ఆడిట్శాఖ డైరెక్టర్ మార్తినేని వెంకటేశ్వర్రావుకు చోటు కల్పించారు.
గ్రామ పంచాయతీ నిధులపై ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే ముందుంది. కేంద్రం అమలుచేస్తున్న ఆన్లైన్ ఆడిట్ విధానాన్ని బీజేపీ పాలిత రా ష్ట్రాలు సైతం పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయా యి. కానీ, తెలంగాణ రాష్ట్రం మూడేండ్లుగా కేంద్రం నిర్ణయించిన లక్ష్యానికంటే అధికంగా చేసింది. రెం డేండ్లుగా వంద శాతం ఆన్లైన్ ఆడిట్ నిర్వహించిం ది. ఆన్లైన్ ఆడిట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆడిట్శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్రావును కేంద్రం పలుమార్లు అభినందించింది.
కేంద్ర పంచాయతీరాజ్ ఏర్పాటుచేసిన నాలుగు బృందాలు.. ఆన్లైన్ ఆడిట్, గ్రామ పంచాయతీల బలోపేతం, నిధుల కేటాయింపు, ఖర్చులు, సామాజిక తనిఖీలు, కమిటీల బలోపేతం, సర్వీసు డెలివరీ, ప్రణాళిక, డిజిటల్ పంచాయతీలు, మహిళల నాయకత్వం, పంచాయతీల ఎన్నికలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తాయి.