హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రంతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ను ఇటీవల విడుదల చేసింది. పాపన్న.. గోల్కొండ నవాబులపై తిరుగుబాటు చేసి, కేవలం 12 మంది సైనికులకు శిక్షణ ఇచ్చి, తర్వాత 1,260 మందిని సైన్యంగా మార్చుకొని యుద్ధం చేసి గోలొండ కోటను జయించిన విష యం తెలిసిందే.
నల్లగొండ జిల్లాలోని ఎన్నో కోటలను కూడా సర్వాయి పరిపాలించారు. బహుజన చక్రవర్తిగా ఖ్యాతి గడించారు. తెలంగాణ వీరుడు పాపన్నగౌడ్ చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్రం గత ఏడాది నిర్ణయించింది. ఆ పోస్టల్ స్టాంపులను తపాలా శాఖ రూపొందించగా, వాటిని కేంద్రం తాజాగా విడుదల చేసింది.