కూసుమంచి, జనవరి 21: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది. రైల్వేలైన్ బొగ్గు, సిమెంట్ వంటి వాణిజ్య, వ్యాపార వస్తువుల రవాణాకు ఈ లైన్ ఉపయోగపడనున్నది.
ఈ రైల్వేలైన్ సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లనున్నది. రైల్వేలైన్ నిర్మాణంపై దక్షిణ మధ్య రైల్వే రెండు రోజులుగా నియోజకవర్గంలో ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏరియల్ సర్వే చేపడుతున్నది. ఈ సర్వే ఆదివారం కూడా కొనసాగింది. ఎయిర్క్రాఫ్ట్ అత్యంత కింద నుంచి ప్రయాణించడంతో నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సర్వేపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ లైన్ ఎంతో ఉపయోగ కరంగా ఉండనున్నది.