HomeTelanganaThe Center Has Struck Another Thunderbolt Against The Electricity Consumers
Time of Day tariff | కరెంటుపై కేంద్రం పిడుగు.. పీక్టైంలో అదనపుచార్జీల బాదుడు
విద్యుత్తు వినియోగదారులపై కేంద్రం మరో పిడుగు వేసింది. పీక్ డిమాండ్ పేరుతో అదనపు చార్జీల వడ్డనకు సిద్ధమైంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్ ఆఫ్ కన్జ్యూమర్) సవరణ రూల్స్ మూసాయిదాను ఇటీవల అన్ని రాష్ర్టాలకు పంపించింది.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పీక్ డిమాండ్ పేరుతో అదనపు చార్జీల వడ్డనకు సిద్ధమైంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్ ఆఫ్ కన్జ్యూమర్) సవరణ రూల్స్ మూసాయిదాను ఇటీవల అన్ని రాష్ర్టాలకు పంపించింది.
టైం ఆఫ్ డే (టీవోడీ) పేరుతో కేంద్రం రూపొందించిన కొత్త విధానంలోని ముఖ్యాంశాలు
విద్యుత్తుకు గరిష్ఠ డిమాండ్ ఉన్న సమయంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 20%, సాధారణ వినియోగదారులకు 10% చొప్పున చార్జీలను పెంచి వసూలు చేయాలి.
రాష్ర్టాలు ఈ ప్రతిపాదనలపై ఏప్రిల్ 14లోగా అభ్యంతరాలను ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
10 కిలోవాట్ల దాకా డిమాండ్ కలిగిన వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు 2024 ఏప్రిల్ 1లో, ఇతర వినియోగదారులకు 2025 ఏప్రిల్ 1లోపు టీవోడీ టారిఫ్ను అమలుచేయాలి.
అన్ని కనెక్షన్లకు స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయాలి. కరెంట్ రీడింగ్ను వినియోగదారులు మొబైల్యాప్, వెబ్సైట్లో చూసుకునే అవకాశం కల్పించాలి. విద్యుత్తు బిల్లులను ఎస్ఎంఎస్, యాప్ ద్వారా నేరుగా పంపించాలి.
టీవోడీ కింద వసూలు చేసే అదనపు చార్జీలను ఏ సమయంలో ఎంత మొత్తంలో వసూలు చేయాలన్న అంశాన్ని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయిస్తుంది. టీవోడీలో క్యాటగిరీల వారీగా వసూలు చేసే అదనపు చార్జీ వివరాలను డిస్కంలు తమ వెబ్సైట్లలో స్పష్టంగా వెల్లడించాలి.
ఒక నెలలో గరిష్ఠ డిమాండ్ నమోదైతే ఆ నెలలో కాకుండా అంతకుముందు 3 నెలల సగటు లోడును లెక్కించాలి.