తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని తెలంగాణ బోర్డుకు సూచించగా, వచ్చే నెల 3వ తారీఖును బోర్డు ఖాయం చేసింది. ఇరు రాష్ర్టాలు సమర్పించిన నీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వల నివేదికపై సమావేశంలో చర్చించనున్నారు.