భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశానికి కొత్త తొవ్వ చూపేందుకు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో బీఆర్ఎస్ ఏర్పాటు కీలక ఘట్టంలో తాము భాగస్వామ్యం కావాలని, ఆ ఘట్టాన్ని కండ్లారా చూడాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శుక్రవారం తెలంగాణ భవన్ గులాబీతోటలా మారింది. ‘జై తెలంగాణ’, ‘జై భారత్’, ‘పీఎం కేసీఆర్’, ‘కేసీఆర్ జిందాబాద్’, ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ నినాదాలతో దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన సందర్భంలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో భావోద్వేగానికి లోనయ్యారు. డప్పు చప్పుళ్లు, కార్యకర్తల నృత్యాలతో తెలంగాణ భవన్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో పెద్ద ఎత్తున ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ కండువా కప్పుకొంటున్న పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎంపీలు కే కేశవరావు, లింగయ్య యాదవ్, మండలి చైర్మన్ గుత్తా, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే దానం తదితరులు
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజల్లో భాగంగా గుమ్మడికాయ కొడుతున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి. చిత్రంలో సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్రాజ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ నామా తదితరులు
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. కర్ణాటక నుంచి మాజీ సీఎం కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్రాజ్, హర్యానా నుంచి గుర్నామ్సింగ్ చౌదాని, ఒడిశా నుంచి అక్షయ్కుమార్, మహారాష్ట్ర నుంచి మాణిక్ కదం, షిరిడీకి చెందిన నీటిపారుదల శాఖ అధికారి సోమ్నాథ్ థోరట్, పుణెకు చెందిన మండి (మార్కెట్) మాజీ అధికారి బాలాసాహెబ్ దేశ్ముఖ్, నాందేడ్కు చెందిన గణేశ్ బాబారావు, ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు నేత హిమాన్షు తివారీ, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆమోద పత్రాలకు పూజలు చేయిస్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేస్తున్న ఎంపీ కే కేశవరావు. చిత్రంలో ఎంపీలు సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, కేఆర్ సురేశ్రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ తరహా దేశాభివృద్ధికి అడుగులేస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీకి తొలి విరాళంగా లక్షా నూట పదహారు రూపాయల చెక్కును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్
భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రులు కే తారక రామారావు, హరీశ్రావు, తలసాని, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్కుమార్, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, విప్ బాల్క సుమన్ తదితరులు
సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ లక్ష్మీనగర్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ పీ ప్రదీప్కుమార్ బీఆర్ఎస్పై తన అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా రావి ఆకుపై బీఆర్ఎస్ ఇంగ్లిష్ అక్షరాలు, భారతదేశ చిత్రపటాన్ని ఆకట్టుకునేలా గీశారు. బీఆర్ఎస్ పార్టీతో సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ తాను రావి ఆకుపై ఈ అద్భుతాన్ని గీశానని ప్రదీప్ చెప్పారు.
జగిత్యాల జిల్లాలో బండాలింగాపూర్ను మండల కేంద్రంగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా అదే గ్రామానికి చెందిన స్వర్ణకారుడు ముప్పిడి సురేశ్ బియ్యపు గింజపై చెక్కిన జై బీఆర్ఎస్ అక్షరాలు
బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ నల్లగొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతులతో కలిసి పటాకులు కాల్చుతున్న గులాబీ శ్రేణులు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ తోరణం వద్ద సంబురాలు చేసుకుంటున్న నాయకులు, కార్యకర్తలు