ములుగు : కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) కొనసాగిస్తూ నిధులను విడుదలని లబ్ధిదారులు కోరుతున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్లో ఉన్న వాటర్ ట్యాంక్ను ఎక్కి దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు.
మంత్రి సీతక్క, కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. దళితులు ఆర్థికంగా ఎదిగే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.