తిరుపతి : తిరుమలలో శ్రీవారి భక్తుల కొరకు సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవనంలో గురువారం ఉదయం ప్రారంభించారు. టీటీడీ ఇప్పటికే గోవిందదునికి గో ఆధారిత నైవేద్యం అందించడంలో భాగంగా దేశీయ గోవుల ఉత్పత్తులతో పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల నైవేద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.
అదేవిధంగా దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్ఫాహరం, భోజనం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టిటిడి భక్తులకు అందించాలని సంకల్పించింది.
సంప్రదాయ భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని సెప్టెంబర్ 8వ తేదీ వరకు టిటిడి ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా దేశీయ వ్యవసాయ పరిశోధకులు విజయరామ్ మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన గో ఆధారిత వ్యవసాయంతో పండించిన దేశీయ బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలను టిటిడి కోనుగోలు చేయడం అభినందనీయమన్నారు. దీనిద్వారా దేశీయ విత్తనాలు, దేశీయ గో జాతులను గ్రామల్లోకి పునః ప్రవేశ పెట్టవచ్చన్నారు.
అనంతరం చిరుధాన్యాల ఆహర నిపుణులు రాంబాబు మాట్లాడుతూ.. దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంటలు వండి భక్తులకు వడ్డిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించినట్లు తెలిపారు. ఇందులో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, అనేక వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నారు.
మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, వర్ష రుతువులో తీసుకోవాల్సిన అహారమైన పచ్చి పులుసు, దోసకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు చెఫ్ గోపి వండి భక్తులకు అందించినట్లు వివరించారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో మన ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుందన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రమేష్బాబు, హరీందర్నాథ్,లోకనాథం,భాస్కర్, ఈఈ జగన్మోహన్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rahul Gandhi: ఆస్తుల అమ్మకాల్లో కేంద్రం బిజీగా ఉంది.. మీ జాగ్రత్త మీరే చూసుకోండి
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు.. ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్
లాకప్ రూంలో పార్టీ చేసుకున్న గ్యాంగ్స్టర్స్ !