నాంపల్లి కోర్టులు, జూన్ 13 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. సిట్ అనుబంధ చార్జ్షీట్ దాఖ లు చేయనున్నదని, కొంతభాగం విచారణ మాత్రమే పూర్తయ్యిందని పీపీ తెలిపారు. తీర్పును బుధవారానికి వాయి దా వేస్తూ కోర్టు ఆదేశించింది.
బొడ్డుపల్లి నర్సింగ్రావు, రోహిత్కుమార్, ము దావత్ ప్రశాంత్ బెయిల్ పిటిషన్లను కొ ట్టివేసింది. సాయిబాబా, మురళీధర్రెడ్డి, మనోజ్కుమార్, అరుణ్కుమార్, రమేశ్, శివకుమార్, క్రాంతి, శశిధర్రెడ్డి, పురేందర్, జాదవ్రాజ్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. తీర్పును బుధవారానికి వాయిదా వే సింది. సుచరితారెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.