హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కోకాపేట్లో ఆదివారం పెరిక ఆత్మగౌరవ భవన పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరకానున్నట్టు వెల్లడించింది.
కార్యక్రమానికి కులబాంధవులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేటలో 2 ఎకరాల భూమితోపాటు, రూ.2 కోట్ల నిధులను కేటాయించిందని చెప్పింది.