ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 8: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బ స్సులో డబ్బులు తరలిస్తున్నారనే స మాచారం మేరకు శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులు సోదాలు చేశారు.
మావల వద్ద బస్సును ఆపి తనిఖీ చేయగా, ఆదిలాబాద్లోని ఓల్డ్ హౌసింగ్బోర్డ్కాలనీకి చెందిన సజ్జనపు లక్ష్మీనారాయణ వద్ద రూ.20.80 లక్షలు, కుంబారం ప్రజాపత్ వద్ద రూ.4,53,300 నగదు లభించింది. వారు సరైన పత్రాలు చూపకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ వద్ద లభించిన డబ్బు ను ఆదాయపన్ను శాఖకు, ప్రజాపత్ వద్ద దొరికిన మొత్తాన్ని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్కు అప్పగించినట్టు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు.