‘ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని వెదిరె శ్రీరాం చేసిన ప్రతిపాదనను తెలంగాణ పక్కన పెట్టిందనే కారణంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసును వెల్లగక్కుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణ కొనసాగుతున్న తరుణంలోనే వ్యాసాల పేరిట కథనాలను వండివార్చుతున్నారు. సాక్ష్యాలు, అభిప్రాయాలు ఉంటే కమిషన్కు అందజేయవచ్చు. ఆ మేరకు ప్రభుత్వం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. అయినా ఆ పని చేయకుండా.. ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నారు. ఇప్పటికే అనేకసార్లు, అనేక మంది లేవనెత్తిన అంశాలనే, ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సంధిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై, కృత్రిమ జలాశయాల నిర్మాణంపై తనకు ఏపాటి అవగాహన ఉందో తన వ్యాసాలతో శ్రీరాం తనంతట తానే బయటపెట్టుకున్నారు.’
– హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ)
కాళేశ్వరంపై ఇప్పటికే మూడు రకాలైన విచారణలు కొనసాగుతున్నాయి. 1) నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విచారణ 2) రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ 3) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నే కేంద్ర మంత్రి సలహాదారుడి విచారణ ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా జరుగుతున్నది. పైన పేరొన్న 3రకాలైన విచారణలకు నీటి పారుదలశాఖ ఇంజినీర్లు, ఉన్నతాధికారులు హాజరై వారడిగిన ప్రశ్నలకు ఇప్పటికే జవాబులు ఇచ్చారు. వేల పేజీల సమాచారాన్ని అందించారు. ఇప్పుడు శ్రీరాం తన విచారణలో అవే ప్రశ్నలు సంధిస్తున్నారు. అన్ని చట్టబద్ద విచారణలు.. ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కొనసాగుతున్న ఈ సమయంలో ఈయన విచారణ అవసరమున్నదా..? ఈయన గారికున్న విచారణార్హత ఏమిటి ? ఇదంతా పీసీ ఘోష్ న్యాయ విచారణను ప్రభావితం చేయడానికి కాకపోతే మరేమైనా ప్రయోజనమున్నదా? కేంద్ర మంత్రి సలహాదారులు వెదిరె శ్రీరాం చేయవలసింది న్యాయవిచారణ కాదు.
జస్టిస్ ఘోష్ కమిషన్కు వ్యక్తిగత హోదాలో తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఒక నివేదికను సమర్పించడం. ఆ రకంగా కమిషన్కు సహకరించడం. వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం నివేదికలను ఆహ్వానిస్తూ వివిధ పత్రికల్లో నీటిపారుదలశాఖ ప్రత్యేక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ పబ్లిక్ నోటీస్ వెదిరె శ్రీరాం దృష్టికి రాలేదనుకోడానికి వీలు లేదు. ఈ వ్యాసపరంపర ఉద్దేశం వేరు కాబట్టి తెలంగాణ ఇంజినీర్ల మీద తానే ఒక విచారణ కమిషనర్గా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆయన సంధించిన ప్రశ్నలకు స్పందించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను అవమానపరచడం భావ్యం కాదు. కమిషన్ విచారణ పరిధిలోని అంశాలను ప్రాజెక్టు ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కమిషన్కు వివరించే పని ఎట్లాగూ చేస్తారు. వాటిని ఇంజినీర్లకు వదిలి వేయడం ఉత్తమం. అయితే ఈ వ్యాస పరంపరలో వెల్లడవుతున్న వెదిరె ఆలోచనల డొల్లతనాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం మాత్రం ఎంతో ఉన్నది.
3 మార్గాల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థలో ఉన్నాయి. మొదటిది శ్రీరాంసాగర్కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరతాయి. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్ 1 పంపులు (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి), లింక్2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు) తిప్పే అవసరం రాదు. ఇక రెండో స్థితి శ్రీరాంసాగర్కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్ ఎల్లంపల్లికి మధ్యనున్న పరివాహాక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశముంది. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్ 2 పంపులు తిప్పి నీటిని మిడ్మానేరుకు చేరవేస్తారు. అకడి నుంచి ఎగువకు అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోస్తారు.
ఇక మూడోది పై రెండుచోట్ల నీటిలభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్ 1, లింక్ 2 పంపులను తిప్పాల్సి వస్తుంది. ఇక ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 2దశల ఆయకట్టు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న లక్ష్మి కాలువ కింద ఉన్న ఆయకట్టు, నిర్మల్ జిల్లాలో ఉన్న సరస్వతీ కాలువ ఆయకట్టు, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద నిజాంసాగర్ ఆయకట్టు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న చిన్న ఎత్తిపోతల పథకాల ఆయకట్టు, మిషన్ భగీరథ అవసరాలు ఈ రివర్స్ పంపింగ్ సీమ్ ద్వారా తీరుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న మొత్తం 10వేలకు పైగా చెరువులు, చెక్ డ్యాంల కిందనున్న ఆయకట్టు స్థిరీకరణకు నికరంగా నీరందించడానికి కాళేశ్వరం భరోసా ఇస్తున్నది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైతాంగం అనుభవంలోకి వచ్చింది. కాళేశ్వరం రూపకల్పన సమయంలో ప్రభుత్వం ఆశించింది కూడా ఇదే. అయితే 2019 నుంచి వరుసగా భారీ వర్షాలు పడుతుండడంతో వానకాలం పంట కాలానికి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే అవసరం అతి తకువ సందర్భాలలో మాత్రమే ఏర్పడింది. కాబట్టే ఎత్తిపోసిన నీటి పరిమాణం తగ్గింది. ఇక ప్రతీ ఏటా 195(180 కాదు) టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే అవసరం ప్రతీసారి రాదు.
ఇక రెండోది కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపాదించిన కొత్త ఆయకట్టు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నది. ఏ ప్రాజెక్టులోనైనా ఆయకట్టు క్రమంగా కాలువల వ్యవస్థ ఉనికిలోకి వస్తున్నా కొద్దీ పెరుగుతుందే కానీ ప్రాజెక్టు హెడ్వర్స్ పూర్తి కాగానే మొత్తం ఆయకట్టు సాగు నీరివ్వడం జరగదు. ఏ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా మొదట హెడ్ వర్స్ .. అంటే డ్యాంలు, బరాజ్లు, స్పిల్వే గేట్లు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు అయితే పంప్హౌస్లు, సర్జిపూల్స్, విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, డెలివరీ సిస్టర్న్లు తదితర అనుబంధ నిర్మాణాలు పూర్తి చేస్తారు. వీటి పైననే ప్రభుత్వాలు ప్రథమ ప్రాధాన్యత కింద నిధులు ఖర్చు చేస్తాయి. ఎందుకంటే ఇవి నిర్మాణం కాకుండా ఆయకట్టుకు నీరివ్వలేం. వాటి తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై ఖర్చు చేస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణమైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లో కూడా జరిగింది ఇదే. 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే హెడ్వర్స్ పూర్తయిన తర్వాతనే 1975లో.. 11 ఏండ్ల తర్వాత మొదటిసారి 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదల చేశారు. దశల వారీగా ఆయకట్టు పెరుగుతూ పోయింది తప్ప ఒకసారే మొత్తం ఆయకట్టు సాగులోకి రాలేదు. 2008-09 నాటికి ఆయకట్టు 9లక్షల ఎకరాలకు చేరుకున్నదన్న వాస్తవాన్ని శ్రీరాం లాంటి వారు గుర్తించాలి. అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. కాళేశ్వరం హెడ్వర్స్ పూర్తి కాగానే ఏటా 900 టీఎంసీలు ఎందుకు ఎత్తిపోయ లేదని శ్రీరాం అడిగిన ప్రశ్న చిన్నపిల్లలు అడిగే అమాయకపు ప్రశ్న కాక మరేమిటి.
గోదావరిపై ఎకువ నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అవసరమని శ్రీరాం అంటున్నారు. మేడిగడ్డ స్థలం అనుకూలమైనదే అని అంటూనే భారీ ప్రాజెక్టు కట్టకుండా చిన్న బ్యారేజీ కట్టి తప్పు చేశారని అంటున్నారు. ఆయన దృష్టంతా ఇచ్చంపల్లి మీదనే ఉన్నది. గోదావరిపై భారీ నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు సాధ్యం కాదని శ్రీరాం గారికి తెల్వకపోవడం విచిత్రం. ఇచ్చంపల్లి చరిత్ర ఆయనకు తెలియదని అనుకోలేం. కఠినమైన పర్యావరణ, అటవీ చట్టాలులేని కాలంలోనే భారీ నిల్వ సామర్థ్యమున్న ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టులను పబ్లిక్ డిమాండ్ ఉన్నప్పటికీ ఆనాటి ప్రభుత్వాలు సాకారం చేయలేకపోయినాయి.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీగా అటవీ భూములు, వందలాది గ్రామాల ముంపు, పునరావాసం సమస్యల కారణంగా పైరాష్ట్రాలు అంతర్రాష్ట్ర ఒప్పందంపై సంతకాలు చేసి కూడా నిరాకరించాయి. ఇచ్చంపల్లి ప్రాజెక్టును తొలుత 112.77 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో మొత్తం నిల్వసామర్థ్యం 366 టీఎంసీలు, నికర నిల్వ సామర్థ్యం 151టీఎంసీలతో నిర్మించడానికి డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే అంతే స్థాయిలో ముంపు కూడా ఉండడంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ప్రాజెక్టు ఎత్తును 95 మీటర్లకు తగ్గిస్తూ మొత్తం నిల్వ సామర్థ్యం 60 టీఎంసీలు, నికర నిల్వ సామర్థ్యం 20.70టీఎంసీలతో మరో డీపీఆర్ తయారైంది.
మహారా్రష్ట్రలో ముంపు గణనీయంగా తగ్గినా ఛత్తీస్గడ్లో ముంపు బాగా ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోలేదు. దీంతో అది మూలన పడింది. మరో విషయం ఏమంటే 83 మీటర్ల ఎత్తు వద్ద నిర్మించిన తుపాకులగూడెం బరాజ్ నీరు కొద్దిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వాగుల్లోకి పోవడం వలన 50 ఎకరాల భూమి మాత్రమే మునుగుతుంది. అంతదానికి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎన్వోసీ ఇవ్వడం లేదు. 152 మీటర్ల ఎత్తు వద్ద తుమ్మిడిహట్టి వద్ద మహారాష్ట్రలో 5 వేల ఎకరాలు ముంపుబారిన పడతాయి. దానికి కూడా మహారాష్ట్ర మొండికిపోయిన అనుభవం మనకున్నది.
ఈ సమస్యలున్న నేపథ్యంలోనే గోదావరి మీద కృష్ణా బేసిన్లో సాధ్యమైనట్టు భారీ జలాశయాలు కట్టడం దుర్లభమైంది. ఆ సమస్యను అధిగమించడానికి ప్రముఖ ఇంజినీర్, ఐక్యరాజ్య సమితి సలహాదారు హనుమంతరావు ‘స్టెప్ ల్యాడర్ టెక్నాలజీ’ పేరిట గోదావరిపై వరుస బరాజ్లను ప్రతిపాదించారు. అందులో మేడిగడ్డ స్థలానికి అతి దగ్గరలో ఉన్న పెద బెల్లాల స్థలం కూడా ఒకటి. ఈ బరాజ్ల్లోని నీరు గోదావరి నదిలోనే నిల్వ ఉంటాయి. కాబట్టి ముంపు, పునరావాసం అతితకువ. అయితే ఆనాటి ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను పకన పెట్టాయి.
కేసీఆర్కు హనుమంతరావు ప్రతిపాదనలపై అవగాహన ఉంది. కాబట్టి తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయాలు వెతికే క్రమంలో ఆయన పెదబెల్లాల స్థలాన్నీ పరిశీలించారు. అదే మేడిగడ్డ బ్యారేజి స్థలం. ఇకడ చాలా మందికి తెలియని అంశం ఒకటి చెప్పాలి. మేడిగడ్డ, ఇచ్చంపల్లి స్థలాల్లో ఏది ఉత్తమమైనది ? అనే చర్చ కూడా కేసీఆర్ జరిపారు. ఆ చర్చలో ఆనాటి ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్రావు, నేను పాల్గొన్నాను. ఆ చర్చ సందర్భంగా విద్యాసాగర్రావు చాలా స్పష్టంగా మేడిగడ్డ వైపునకే మొగ్గు చూపారు.
ఇచ్చంపల్లి వద్ద 1978లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ఎంత లోపభూయిష్టమైనదో వివరించారు. బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను తిప్పలు పడి ఒప్పించినా ప్రధానమంత్రి మోదీకి చెప్పి తెలంగాణ పుట్టక ముందే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు, సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని లాక్కున్న కట్టర్ తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు పరిపాలనలో ఉన్న ఏపీని ఒప్పించడం దుర్లభం అని చెబుతూ మేడిగడ్డ వద్ద బరాజ్కు ఒక మహారా్రష్ట్రతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుందని సూచించారు. దానితో కేసీఆర్ కూడా సంతృప్తి చెంది మేడిగడ్డ స్థలం వద్ద బరాజ్ నిర్మాణానికి సర్వే చేయించమని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే శ్రీరాం గారికి ఇచ్చంపల్లి స్థలం మీదున్న వ్యామోహానికి సకారణం ఏదీ లేదని చెప్పడానికే. గోదావరి జలాల వినియోగంపై ఆయన ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అందులో ఆయన గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రదేశానికి కొద్ది దిగువన కాళేశ్వరం వద్ద ఒక మేజర్ డ్యామ్ను 115మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో నిర్మించాలని ప్రతిపాదించారు. అక్టోబర్ 2018లో వరంగల్లో ‘గోదావరీ జలాల సమగ్ర వినియోగం : సమస్యలు, పరిషారాలు’ అన్న అంశంపై జరిగిన సదస్సులో చేసిన ప్రసంగంలో ఆయన అన్న మాటలు గుర్తుకు వస్తున్నవి. అప్పటికే మేడిగడ్డ బరాజ్ నిర్మాణం ప్రారంభమైంది.
తన ప్రతిపాదనలను కేసీఆర్ పకనబెట్టినట్టు ఆ సదస్సులో అకసును వెళ్లగక్కారు. మగ్గులో నుంచి బకేట్లోకి నీరు తోడిపోస్తున్న చందంగా ఉందని, తకువ సామర్థ్యంతో కాళేశ్వరం బరాజ్ నిర్మించి 50టీఎంసీల సామర్థ్యమున్న మల్లన్నసాగర్కు నీటిని ఎత్తిపోయడం వింతగా ఉందని, మల్లన్నసాగర్లాంటి జలాశయాలను నదుల్లో కట్టకుండా ఊళ్లల్లో కట్టడం ఇంజినీరింగ్ సూత్రాలకు విరుద్ధమని అన్నట్టు ఆనాడు పత్రికలు రిపోర్ట్ చేశాయి. విచిత్రంగా మే2న అచ్చయిన నాలుగో వ్యాసంలో అవే అంశాలు లేవనెత్తారు. శ్రీరాం గారిని అప్పటి హాంగోవర్ ఇంకా వదిలిపెట్టినట్టు లేదు. వారి ప్రతిపాదనలను తెలంగాణ ఇంజినీర్లు అధ్యయనం చేస్తే కండ్లు బైర్లు గమ్మే వాస్తవాలు వెల్లడయ్యాయి.
115మీటర్ల వద్ద తెలంగాణలో 53,352 ఎకరాలు, మహారా్రష్ట్రలో 27,911 ఎకరాలు, మొత్తం 81,263 ఎకరాలు విస్తీర్ణంలో ముంపు ఉంటుందని అంచనా వేశారు. (మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో సేకరించవలసిన భూమి 55,800 ఎకరాలు) తెలంగాణ ఇంజినీర్ల అధ్యయనం ప్రకారం 115మీటర్ల కాంటూర్ లైన్ దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వరం దేవాలయం మెట్ల వరకు వస్తుంది. గుడి మాత్రమే ముంపులో ఉండదు. సిరొంచా పట్టణం చుట్టూ నీరు నిలిచి ఉంటుంది. నిజాం జామానాలో గుట్టపై కట్టిన గెస్ట్హౌజ్ తప్ప ఏదీ మిగలదు.
మహాదేవపూర్, మంథని పట్టణాల దగ్గరికి నీరు వస్తుంది. చెన్నూర్ పట్టణానికి ముంపు బెడద తప్పదు. ఇక పూర్తిగా ముంపుకు గురయ్యే గ్రామాలు తెలంగాణలో 51, మహారాష్ట్రాలో 21, పాక్షికంగా ముంపుకి గురయ్యే గ్రామాలు తెలంగాణలో 20, మహారాష్ట్రాలో 31, ఊళ్లు మిగిలి కేవలం భూములు మాత్రమే ముంపు బారిన పడుతున్న గ్రామాలు తెలంగాణలో 12, మహారాష్ట్రలో 7. ఇక 115 మీటర్ల వద్ద డ్యాం వల్ల ప్రభావితమవుతున్న మొత్తం గ్రామాలు తెలంగాణలో 83, మహారాష్ట్రలో 59. ఇరు రాష్ట్రాల్లో మొత్తం 142 గ్రామాలు.
ఈ ముంపు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుతో పోల్చినప్పుడు చాలా చాలా ఎకువ. ఇప్పుడున్న కఠినమైన పర్యావరణ, అటవీ చట్టాల నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ముంపుతో ప్రాజెక్టుని కట్టడం సాధ్యమేనా శ్రీరాం గారు ? పైగా ప్రాచీన, దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వరాన్ని, తాలూకా కేంద్రమైన సిరొంచ పట్టణాన్ని కోల్పోవడానికి తెలంగాణ, మహారాష్ట్రాలు సిద్ధపడే అవకాశముందా? ఇది చాలా హాస్యాస్పదమైన ప్రతిపాదనని ఆనాడే తెలంగాణ ఇంజినీర్లు భావించారు. ఇంత హాస్యాస్పదమైన ప్రతిపాదనను అమాయాకుడు, సహృదయుడు, ఆనాటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి బండారు దత్తాత్రేయతో తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయించడం వెదిరే వారికే చెల్లింది.
ఇక మేడిగడ్డ వద్ద 100 మీటర్లు ఎఫ్ఆర్ఎల్ వద్ద 16టీఎంసీల నిల్వ నుంచి 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ జలాశయాన్ని ఎట్లా నింపుతారు ? ఇది మగ్గులో నుంచి బకేట్లోకి నీరు తోడిపోస్తున్న చందంగా ఉందని శ్రీరాం గారు తన వ్యాసంలో ఎద్దేవా చేశారు. ఇకడ కూడా తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. 40 ఏండ్ల గోదావరి ప్రవాహాలను పరిశీలిస్తే మేడిగడ్డ వద్ద నుంచి సరాసరి ప్రతీ సంవత్సరం 1650 టీఎంసీల నీరు నికరంగా ప్రవహిస్తున్నది. జూన్ నుంచి మార్చి దాకా నీటి ప్రవాహాలు ఉంటాయని సీడబ్ల్యూసీ వారి లెకలే చెబుతున్నాయి. సరాసరి జూన్లో 51, జూలైలో300, ఆగస్టులో607, సెప్టెంబరులో 424, అక్టోబరులో 176, నవంబరులో 39, డీసెంబరులో 17, జనవరిలో12 , ఫిబ్రవరిలో11 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలుస్తున్నది. ఇంతకంటే ఎకువ ప్రవాహాలున్న సంవత్సరాలు కూడా ఉన్నాయి.
జూన్లో ఒక టీఎంసీ, జూలై నుంచి అక్టోబరు దాకా రోజుకు 2టీఎంసీలు తోడుకోవడానికి ఎటువంటి ఇబ్బందుల్లేవు. నవంబరులో ఒక టీఎంసీ, డిసెంబరు నుంచి ఫిబ్రవరి దాకా అర టీఎంసీ తోడుకోవడానికి గోదావరిలో ప్రవాహాలుంటాయి. గోదావరిలో సంవత్సరానికి కనీసం 9నెలలు నీటిని తోడుకోవడానికి ప్రవాహాలు ఉంటాయని సీడబ్ల్యూసీ లెకలు నిర్ద్వందంగా తేల్చి చెబుతున్నాయి. కాబట్టి మేడిగడ్డ వద్ద 16టీఎంసీల చిన్న జలాశయం నుంచి కూడా మల్లన్నసాగర్ తదితర జలాశయాలను నింపుకోవడానికి ఉన్న అవకాశాలపై ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు.
ధవళేశ్వరం బరాజ్ నిల్వ సామర్థ్యం 3టీఎంసీలు. బరాజ్ నుంచి తరలించే నీరు 150 టీఎంసీలకు పైబడే ఉంటుంది. బ్యారేజీల నిల్వ సామర్థ్యానికి, తరలించే నీటికి పోలిక పెట్టడం అశాస్త్రీయం. 16టీఎంసీల మేడిగడ్డ జలాశయం నుంచి 195టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాంకేతికంగా అసాధ్యం ఏమీ కాదు. దానికి ఎకువ నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయమే అవసరం లేదు. నదిలో ప్రవాహాలున్నాయా? లేదా అన్నదే ప్రామాణికం. నిజానికి మల్లన్నసాగర్కు నీరు ఎత్తిపోసేది 25టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న మిడ్మానేరు జలాశయం నుంచి అన్న సంగతి శ్రీరాం గమనించకపోవడమే ఒక అభాస.
2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి ఎత్తిపోసిన నీటి వివరాలు పొందుపరుస్తూ ఏటా 180 టీఎంసీల చొప్పున ఈ ఐదేండ్లలో 900 టీఎంసీల నీటిని ఎత్తి పోయాల్సి ఉండగా కేవలం 162.36 టీఎంసీలే ఎత్తిపోశారని శ్రీరాం ప్రశ్నిస్తున్నారు. ఇది కేంద్ర మంత్రికి సలహాదారుడు ఆడగవలసిన ప్రశ్న కానే కాదు. ఆ ప్రశ్న అడిగిండంటేనే ఆయనకు కాళేశ్వరం పని తీరు, నీటిని ఎత్తిపోసే విధానం మీద అసలే అవగాహన లేదని అర్థమవుతున్నది. అందుకే మళ్లీ వివరిస్తాను.
జలాశయాలను నదుల్లో కాకుండా ఊళ్లలో నిర్మించడం ఇంజినీరింగ్ సూత్రాలకు విరుద్ధమని మల్లన్నసాగర్ను ఉద్దేశించి శ్రీరాం గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి ఊళ్లలో నిర్మించినవి కాదు. గుట్టలను అనుసంధానం చేస్తూ నిర్మించిన కృత్రిమ జలాశయాలు. ఎత్తిపోతల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నదులపై మాత్రమే జలాశయాలు నిర్మించాలని చెప్పడం విచిత్రం. ప్రాణహిత -చేవెళ్ల డీపీఆర్పై సూచనలు చేస్తూ సీడబ్ల్యూసీనే 160 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టులో తగినంత నిల్వ సామర్త్యం లేదని చెపుతూ ఆన్ లైన్ జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోమని, కృత్రిమ జలాశయాలు నిర్మించుకోమని ప్రభుత్వానికి సూచించింది.
ఉమ్మడి ప్రభుత్వం ఆ సూచనని బేఖాతరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఆ సూచన ఆధారంగా జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 14 నుంచి 147 టీఎంసీలకు పెంచింది. అందులో భాగంగా మల్లన్నసాగర్ నిల్వ సామర్థ్యాన్ని 1.5 నుంచి 50 టీఎంసీలకు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 62శాతం ఆయకట్టు, హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా మల్లన్నసాగర్పైన ఆధారపడింది కాబట్టి అకడ 50 టీఎంసీల జలాశయం అవసరమని ఇంజినీరింగ్ నిపుణులు భావించారు. ఇక నదులపై కాకుండా కృత్రిమ జలాశయాలు నిర్మించడం ఇది మొదటిసారి కాదు. రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రాయలసీమలో నిర్మించిన భారీ జలాశయాలన్నీ కృత్రిమ జలాశయాలే. కండలేరు- 68టీఎంసీలు, గోరకల్లు 10టీఎంసీలు, వెలిగొండ 41 టీఎంసీలు, వెలుగోడు 17టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17టీఎంసీలు, అవుకు 7టీఎంసీలు, అలుగునూరు 3టీఎంసీలు.. ఈ జలాశయాలన్ని నదులు లేని చోట నిర్మించినవి కావా? వాటిపై ఎవరూ ఎన్నడూ ప్రశ్నించిన దాఖలాల్లేవు. ఇవ్వాళ తెలంగాణ అదే పని చేస్తుంటే ఇంజినీరింగ్ సూత్రాలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు.
భారీ ఎత్తిపోతలకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సూత్రీకరణకు విలువే లేదు. ఎత్తిపోతల పథకాల్లో పెద్ద జలాశయాల నిర్మాణం అత్యవసరం. అందుకే మల్లన్నసాగర్ను 50 టీఎంసీలతో నీటి సరఫరా అవసరాల రీత్యా రీ డిజైన్ చేయడం తప్పనిసరైంది. శ్రీరాం వాపోయినట్టు గోదావరి నదిపై నిల్వ సామర్థ్యం లేకపోవచ్చు కానీ గోదావరి బేసిన్లో ఇప్పుడు తెలంగాణ అవసరాలకు తగినంత నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉన్నాయి. కాళేశ్వరం పరిధి, దాని కింద సమ్మకసాగర్ 7 టీఎంసీలు, సీతమ్మసాగర్ 36 టీఎంసీలు (నిర్మాణంలో ఉన్నది) మొత్తం 371టీఎంసీల నిల్వ సామర్థ్యమున్నది. అవసరం ఏర్పడినప్పుడు ఈ జలాశయాలను నింపడానికి కాళేశ్వరం వ్యవస్థ సిద్ధంగా ఉన్నది. కాబట్టి గోదావరిపై పెద్ద స్టోరేజి రిజర్వాయర్ లేదని శ్రీరాం వాపోవడంలో అర్థం లేదు.
వరదాయిని కాళేశ్వరం
ఆంధ్రజ్యోతిలో వెదిరె శ్రీరాం రాసిన కాళేశ్వరంపై వ్యాసాలకు వీ ప్రకాశ్ కౌంటర్