Andhra Pradesh | హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ): నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే సాగర్టెయిల్పాండ్ నుంచి నీళ్లు మళ్లించామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు వెల్లడించింది. టెయిల్పాండ్ నుంచి అనుమతుల్లేకుండా 3 టీఎంసీల నీళ్లను మళ్లించుకుపోవడంపై తెలంగాణ బోర్డుకు ఫిర్యాదు చేసింది.
దీనిపై వివరణ కోరుతూ బోర్డు ఏపీకి లేఖ రాసింది. బోర్డు లేఖపై తాజాగా ఏపీ స్పందిస్తూ.. తీవ్ర నీటి కొరత కారణంగా 4 టీఎంసీలను కావాలని గత త్రీమెన్ కమిటీ సమావేశంలోనే విన్నవించామని బదులిచ్చింది. అందులో భాగంగానే సాగర్టెయిల్పాండ్ నుంచి నీటిని మళ్లించుకున్నట్టు బోర్డుకు వివరించినట్టు తెలిసింది.