Hyderabad | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగా ణ): హైదరాబాద్ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ర్టాలకు హైదరాబాద్ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు ఉత్తర్వులు ఇవ్వాలని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ‘ప్రజా సంక్షేమ సేవా సంఘం’ కార్యదర్శి పొదిలి అనిల్కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు.