హైదరాబాద్ : పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్లో మెగా వారి సహకారంతో ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. మన ఊరు-మనబడి కింద ప్రభుత్వం మూడువేల కోట్ల రూపాయలకు పైగా నిధులను పాఠశాలలకు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు.
పాఠశాలల విషయంలో ఎవరూ కూడా రాజకీయాలు చేయవద్దని సూచించారు. వచ్చే జూన్లో 15 వందల స్కూళ్లను ప్రారంభించనున్నామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుశీందర్రావు, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్ ,కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.