హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్కు 5,08,143 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, 5,03,114 మంది హాజరయ్యారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 87 మంది అటెండ్ అయ్యారు. ఇక మిగిలిన రెండు పరీక్షలను మే 30, 31వ తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ 1(సంస్కృతం, అరబిక్) ఎగ్జామ్ను 30న, పేపర్ 2ను 31న నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎస్ఎస్సీ వోకేషనల్ కోర్సు(థియరీ) పరీక్షను జూన్ 1న నిర్వహించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి టెన్త్ పేపర్ వాల్యూయేషన్ జరగనుంది.