అయిజ : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. వరద నీరు డ్యాంలోకు చేరుతుండటంతో 10గేట్లు ఒక్క అడుగు ఎత్తి 14,650 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు టీబీ బోర్డ్ ఎస్ఈ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.