హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరుగవచ్చని తెలిపింది. ఆదిలాబా ద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో ఈ నెల 27న ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
28న వేడిగాలులు కొనసాగుతాయని, తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్నగర్, నారాయణపేట వంటి జిల్లాల్ల్లో ఎండ తీవ్రత ఎకువగా ఉంటుందని పేర్కొన్నది. వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది.