కల్యాణలక్ష్మి
కంటి వెలుగు
కేసీఆర్ కిట్ పథకం
ముఖ్యాంశాలు
బాలిక ఆరోగ్య రక్ష
తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్ల ఖర్చుతో వయసు 12-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి బాలిక ఆరోగ్యరక్ష పథకాన్ని అమలు చేస్తున్నది. చదువుకొనే బాలికలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్ల’ ను ప్రభుత్వం పంపిణీ చేసింది. కిట్లలో 21 వస్తువులు ఉంటాయి. ప్రతి బాలికకకు 12నెలలకు సరిపోయే విధంగా రూ. 1600 ఖరీదు చేసే వస్తువులను ఉచితంగా పంపిణీ చేసింది. అదనంగా బాలబాలికలకు ప్రతి ఒక్కరికి 180 మిల్లీలీటర్లు హ్యాండ్వాష్ను ఉచితంగా అందించారు.
డయాలసిస్ సెంటర్లు
18 ఆగస్టు 2017న సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో నాటి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి డయాలసిస్ సెంటర్లు ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన కిడ్నీ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డయాలసిస్ సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రభుత్వ ఆస్పత్రులు, 73 డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి డయాలసిస్ సెంటర్ను సిద్దిపేటలో ప్రారంభించారు.
షీ టీమ్స్
మహిళలు, యువతులు, విద్యార్థినులపై నిరంతరంగా కొనసాగుతున్న ఈవ్ టీజింగ్ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 14న షీ టీమ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. షీ టీమ్స్ మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడుతున్నాయి. కాలేజీలు, బస్టాండ్స్, రద్దీ ఉన్న ప్రదేశాల్లో షీ టీమ్స్ సభ్యులు మఫ్టీ లో సంచరిస్తారు. బస్సులు, కార్యాలయాలు, రైళ్లలో ‘షీ’ పేరుతో బృందాలను ఏర్పాటు చేశారు.
వెల్నెస్ సెంటర్
24 డిసెంబర్ 2016న ఖైరతాబాద్లో ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద సేవలు అందించేందుకు 14 సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు.
గ్రామీణ సంచార పశువైద్యశాల
గ్రామీణ సంచార పశు వైద్యశాలను 2017 సెప్టెంబర్ 15న హైదరాబాద్లో ప్రాంరభించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజక వర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశువులకు వైద్యసేవల్ని అందించడానికి 100 గ్రామీణ సంచార పశువైద్య వాహనాలను ప్రారంభించారు. దేశంలో సంచార పశువైద్యసేవల వాహనాలను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సంచార పశువైద్య సేవలకు టోల్ ఫ్రీ నంబర్: 1962.
గొర్రెల పంపిణీ పథకం
‘టీ-శాట్’ నెట్వర్క్ ఆవిష్కరణ
జనహిత కార్యక్రమం
నిరంతర విద్యుత్ పథకం
ప్రాక్టీస్ బిట్స్
1. మాతా శిశు సంరక్షణ, బాలింతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కేసీఆర్ కిట్ పథకం లోగోలోని నినాదం ఏమిటి?
1) అమ్మకు అండగా…బిడ్డకు తోడుగా
2)అమ్మకు ఆత్మీయతతో..బిడ్డకు ప్రేమతో
3) అమ్మకు అండతో…బిడ్డకు దీవెనా
4) ఏదీకాదు
2. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను ఎప్పుడు ప్రారంభించింది?
1) 29 అక్టోబర్, 2019
2) 29 అక్టోబర్, 2021
3) 29 అక్టోబర్, 2020
4) 15 ఆగస్టు, 2020
3. భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
1) వాసాలమర్రి, భువనగిరి
2) చౌటుప్పల్, భువనగిరి
3) గట్టు, జోగులాంబ గద్వాల
4) మూడు చింతలపలి,్ల మేడ్చల్ మల్కాజ్గిరి
4. రాష్ట్రంలో రైతుబీమా పథకం కింద నమోదైన సభ్యుడు లేదా పట్టాదారుకు ఉండాల్సిన వయస్సు?
1) 18 ఏండ్ల నుంచి 62 ఏండ్ల వరకు
2) 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకు
3) 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వరకు
4) వయస్సుతో సంబంధం లేదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది
5. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది?
1) రూ. 51,000
2) రూ. 75,000
3) రూ.75,116
4) రూ. 1,00,116
సమాధానాలు
1-2, 2-3,
3-4, 4-3,5-4