నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, అక్టోబర్ 16: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నా యి. నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 3,79,771 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 3,66,182 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, 588.80 మేర నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టుకు 2,58,953 క్యూ సెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. అలాగే మూసీ ప్రా జెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 7,845.70 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ఆరు క్రస్టు గేట్ల ద్వారా 891.28 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎస్సారెస్పీలోకి 87,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, 22 గేట్ల ద్వారా 68,640 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 36 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు 7 వరద గేట్లు ఎత్తి 43,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు 32,892 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. రెండు గేట్ల ద్వారా 32,892 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కకు 3,05,250 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్న.