హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో అందుకు రూ.7,289 కోట్లు కేటాయించింది. ఇది వరకే ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపగా, సర్కారు మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. మొదటి విడుతలో 9,123 స్కూళ్లను ఎంపికచేయగా, వీటి కోసం రూ. 3,497 కోట్లను వెచ్చించనున్నది. మండలం యూనిట్గా అత్యధిక ఎన్రోల్మెంట్ నమోదైన 35 శాతం స్కూళ్లను ఎంపికచేయగా, ఆయా పాఠశాలల్లో 65 శాతం విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో మొత్తం 12 రకాల వసతులను కల్పించేందుకు కార్యాచరణను రూపొందించింది.