CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, పర్యటన ఉద్దేశాన్ని మరిచి చేస్తు న్న రాజకీయ విద్వేష ప్రకటనలను తెలంగాణ ప్రజ లు ఈసడించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాలో అవాకులు, చెవాకులు పేలడంపై మండిపడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రం ఔన్నత్యాన్ని పెంచేలా సీఎం ప్రసంగాలు ఉం డాలి, కానీ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ సీఎం హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు.
బ్రిటన్లో హలో లండన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘పులి అంట! ఇంట్లో పండుకున్నదంట! లేచి వస్తదంట! మేము కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నం బిడ్డా.. మా దగ్గర బోనుంది.. మా దగ్గర వల ఉన్నది. రమ్మను పులి ని.. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీసి కట్టేందుకు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నా రు. ఒక్క వేటుకే బొక్కబోర్లా పడ్డవాళ్లు మన గురిం చి మాట్లాడుతున్నారు.. మా కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి.. ఆ అహంకారం ఏంది? ఆ బలుపేంది? ఆ మాటలేంది? ఇంక కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం తగ్గినట్టు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ బలుపును కూడా దించే పనిని మా కార్యకర్తలు తీసుకుంటరు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ నిషాన్ లేకుండా వంద మీటర్ల గోతి తీసి పాతిపెడుతాం’ అని నోటికొచ్చినట్టు మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో విదేశీ వేదికలపై రాష్ర్టానికి పెట్టుబడులను రప్పించేందుకు నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమించా రు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంపై కుదుర్చుకున్న ఒప్పందాలతో పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. ఆ వేదికలపై కేటీఆర్ చేసిన ప్రసంగాలు, పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్లతో తెలంగాణ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయి. అప్పడు కేటీఆర్ వ్యవహార శైలితో.. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణవాదులు పోల్చి చూస్తున్నారు. తాను వచ్చింది పెట్టుబడులను సాధించడానికా? లేక రాజకీయాలు చేయడానికా? అనే విచక్షణను కూడా మరిచారన్న విమర్శలు వచ్చాయి.