హైదరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కర్నాటక రాష్ట్ర పర్యటన లో భాగంగా దక్షిణ కన్నడ ప్రధాన కేంద్రం మంగళూరు లో గీతవృత్తిని పునరుద్ధరించాలని స్వామి ప్రణవానంద చేపట్టిన మహాపాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో గీత వృత్తిని పునరుద్ధరించేందుకు చేస్తున్న పోరాటాలకు తెలంగాణ గౌడ సంఘాలు మద్దతుగా ఉంటాయని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలో గీత వృత్తిని పునరుద్ధరణ కోసం చేపట్టిన మహా పాదయాత్రను ఆయన స్వాగతించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మంగళూరు చేరుకున్న మంత్రికి వేలాదిమంది ఈడిగ, గీత కార్మిక, వృత్తిదారులు స్వాగతం పలికారు.