TS Covid Cases | కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ పంజా విసురుతున్నది. కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,44,566కి పెరిగింది. కొత్తగా నలుగురు కోలుకోగా.. ఇప్పటి వరకు 8,40,396 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 మంది కొవిడ్కు చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, మరో 30 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.