హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 765 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 648 మంది బాధితులు కోలుకోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,12,381కి చేరింది. ఇందులో 8,03,661 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,609 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 35,094 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 98.93శాతం రికవరీ రేటు ఉండగా.. 0.51శాతం మరణాల రేటుందని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 356 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 57, మేడ్చల్ మల్కాజ్గిరిలో 56, ఖమ్మంలో 34 కొత్త కేసులు రికార్డయ్యాయి.