హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం 563 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి పరీక్షలు నిర్వహించగా, 563 మందికి పాజిటీవ్గా తేలినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం 4,882 మంది రోగులు ఐసోలేషన్లో ఉన్నారు.
మొత్తం 434 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.88శాతంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.