హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని విమర్శించారు. అవిశ్వాసంపై చర్చలో బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రజల వాణిని వినిపిస్తామని, కేంద్రం వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తామని వెల్లడించారు.
కేంద్రం సాయం సున్నా
తెలంగాణకు కేంద్రం నుంచి అందిన సాయం శూన్యమని నామా పేర్కొన్నారు. తెలంగాణపై వివక్ష చూపుతూ రాష్ట్ర ప్రజలపై కక్ష సాధిస్తున్నదని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేసి, తెలంగాణకు మాత్రం ఒకటీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయలేదని, విభజన చట్టం హామీల అమలులో మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. కరోనా వంటి విపతర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగకుండా సీఎం కేసీఆర్ ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
అన్ని రంగాల్లో కేంద్రం విఫలం: ఎంపీ రంజిత్రెడ్డి
దేశం ఎదురొంటున్న కీలక సమస్యలను పరిషరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఎంపీ రంజిత్రెడ్డి విమర్శించారు. మణిపూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి రిక్తహస్తమే ఎదురైందని ఆరోపించారు.