హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ కోరింది. శనివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని, పంచాయతీలను గ్రేడ్లుగా విభజించాలని, కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానించారు.