ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి
యాదాద్రి, అక్టోబర్ 8: బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. శనివారం ఆయన యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు. దళితబంధు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ను దళితుల పక్షపాతిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బీజేపీకి దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.