Minister KTR | తెలంగాణ శాసనసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎన్నికల వేళ బిజీబిజీగా గడుపుతున్నారు. వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, రోడ్షోలు, టీవీ ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే గత వారం నగరంలోని ప్రముఖ నీలోఫర్ కేఫ్ (Cafe Niloufer)లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాదాబ్ హోటల్ (Shadab Hotel) కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.
శుక్రవారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్.. నేరుగా చార్మినార్ సమీపంలోని ఫేమస్ షాదాబ్ రెస్టారెంట్కు వెళ్లారు. మంత్రిని చూసిన అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా బిర్యానీ (Shadab Biryani) ఆర్డర్ చేసిన మంత్రి కేటీఆర్.. సామాన్య ప్రజలతో కలిసి కూర్చొని తిన్నారు. అక్కడున్న వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి మొజంజాహీ మార్కెట్ (Mozamjahi Market)కు వెళ్లారు. అక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ (Famous Ice cream) షాపులో ఐస్క్రీమ్ రుచి చూశారు. కేటీఆర్ రాకతో ఆ రెండు ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. మంత్రిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ ఆకస్మిక పర్యటనలో ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
Shadab Biryani / Famous Ice cream 🤔
Or
Why not both, it’s Friday night after all! 😋
An impromptu visit to one of the most iconic food spots in the city. Spent some delightful time with my fellow Hyderabadis out there 😊 pic.twitter.com/cPp4sYN2V5
— KTR (@KTRBRS) November 18, 2023
ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నిలోఫర్ కేఫ్లో సందడి చేసిన విషయం తెలిసిందే. కేఫ్లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్పై, ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధిపైన ప్రశంసలు కురిపించారు.
Few more glimpses from last night! pic.twitter.com/MC5UlZTK5I
— KTR (@KTRBRS) November 18, 2023
Also Read..
KTR | ప్రతి ఓటు విలువైనదే.. 30న అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : మంత్రి కేటీఆర్
MLC Kavitha | బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్: ఎమ్మెల్సీ కవిత
Telangana | తెలంగాణ వచ్చిన తర్వాత కవులు, పాటలు ఎందుకు తగ్గిపోయాయి?.. ఓ నవలా రచయిత చెప్పిన కారణమిదే!