కౌటాల, మే 5 : అధికారుల పట్టింపులేని తనంతో కౌటాల మండలంలోని తలోడి పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారింది. కేసీఆర్ సర్కారులో ఆహ్లాదకరంగా తీర్చి దిద్దిన ఈ వనం.. ప్రస్తుతం కళావిహీనంగా మారింది.
పూలు, పండ్ల మొక్కలు ఎండిపోయాయి. వాకింగ్ ట్రాకర్స్, పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన వస్తువులు ధ్వంసమయ్యాయి. కంచెలు దొంగలు ఎత్తుకుపోయారు. లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు.