నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్కు రాజకీయాలు ముఖ్యం కాదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధే ఆయన సంకల్పమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికకు కారకుడైన రాజగోపాల్రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కోట్లను మునుగోడు అభివృద్ధికి ఖర్చు చేస్తానంటే కేసీఆర్ సంకల్పం నెరవేరినట్టే అవుతుందని, అందుకోసం ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికైనా సిద్ధ్దమేనన్న తన సవాల్ను పునరుద్ఘాటించారు. ఈ నెల 13 వరకు ఆ ప్రకటన చేస్తే నామినేషన్ కూడా వేయబోమన్నారు. మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తో కలిసి మంత్రి మునుగోడు మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, జక్కలవారిగూడెం, రావిగూడెంలో ప్రచారం నిర్వహించారు. తమ సవాల్కు మోదీ, అమిత్షా స్పందించాలని డిమాండ్చేశారు. దక్షిణ తెలంగాణలో ప్రాప కం కోసమే మునుగోడు ఉపఎన్నికను ప్రజలపై రుద్దుతున్నదని బీజేపీపై మండిపడ్డారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యామలంగా మారుతుంటే బీజే పీ నేతలకు గిట్టట్లేదని ఆరోపించారు. రైతుబందు, రైతుబీమా, నిరంతర విద్యుత్తుతో దేశవ్యాప్తంగా కేసీఆర్కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక బీజేపీ రాష్ర్టాభివృద్ధికి మోకాలడ్డుతున్నదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడు అభివృద్ధి కోస మే రాజీనామా అయితే, కేంద్రం నుంచి నిధులెలా తెస్తాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్రెడ్డికి తీవ్ర పరాభవం తప్పదని హెచ్చరించారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని, ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అహర్నిశలు కృషి చేశా..
మునుగోడు అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్ పనులను పూర్తి చేస్తానని కూసుకుంట్ల హామీ ఇచ్చారు. శివన్నగూడెం రిజర్వాయర్ను పూర్తి చేస్తే మునుగోడు సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాజగోపాల్రెడ్డి యత్నించారని ఆరోపించారు. తాను గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
గులాబీలోకి వలసల జోరు
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. మంగళవారం మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా చేరికలు కొనసాగాయి. చౌటుప్పల్ మండలంఎల్లగిరిలో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 50 కుటుంబాలు గులాబీ పార్టీలో చేరాయి. నాంపల్లి మండలం ముష్టిపల్లిలో ఎంపీ మాలోతు కవిత సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్ మండలం ఎల్లగిరికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన 150 మంది కార్యకర్తలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చౌటుప్పల్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బుడగ జంగాల నాయకులు 100 మంది గులాబీ కండు వా కప్పుకొన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఫరీదాతోపాటు 10 కుటుంబాలు ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ సమక్షంలో పార్టీలో చేరాయి. మునుగోడు మండలం జక్కలివారిగూడేనికి చెందిన పలువురు కాంగ్రెస్ వార్డు సభ్యులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారిలో వార్డు సభ్యులు జక్కలి రవీందర్, జక్కలి శ్రీను, దోటి రమేశ్, యాదగిరి ఉన్నారు. నాంపల్లి మండలంఎస్డబ్ల్యూ లింగోటంలో నేరళ్లపల్లి, పెద్దపురం, తుంగపాడ్, ముష్టిపల్లి, చిట్టంపాడ్ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రె స్, బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.