హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులతో కలిసి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్గా నియామకమైన గడ్డం ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Hyderabad: Telangana Legislative Council Chairman Gutha Sukender Reddy congratulated Gaddam Prasad Kumar at his chamber. Gaddam Prasad Kumar was unanimously elected as the Speaker of the Telangana Legislative Assembly. pic.twitter.com/kLx2b5vfht
— ANI (@ANI) December 14, 2023