షాబాద్, మే 2: రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. దీంతో చెరువులో పూడిక తీసి కట్టను అభివృద్ధి చేశారు.
గత మూడేండ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువు నిండి అలుగుపారింది. ప్రస్తుతం చెరువు నీటితో జలకళ సంతరించుకొన్నది. 180 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద సాగు చేస్తున్న షాబాద్, కేశవగూడ, సంకెపల్లిగూడ, శేరిగూడ, పటేల్గూడ, ముద్దెంగూడ, మల్లారెడ్డిగూడకు చెందిన 200 మంది రైతులు సంబురపడుతున్నారు.