హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు.
రాష్ట్రం మ రింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, సిబ్బంది పాల్గొన్నారు.